న్యూఢిల్లీః హ్యాకింగ్కు పాల్పడిన డెలాయిట్ ఇండియా ఉద్యోగిపై కంపెనీ వేటు వేసింది. డెలాయిట్ ఇండియాలో ఉద్యోగి అయిన ఆదిత్య జైన్ తన టీంతో కలిసి ప్రముఖుల ఫోన్లు, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కావడంతో, కంపెనీ వెంటనే అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. గురుగ్రామ్లోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్న ఇతను ప్రపంచవ్యాప్తంగా ‘వైట్ఇంట్’ (WhiteInt) అనే హ్యాకర్ సంస్థను నడుపుత్నాడు. ప్రముఖుల ఇమెయిల్ సమాచారాన్ని దొంగిలించేందుకు కొంతమందిని హ్యాకర్లను కూడా నియమించుకున్నాడు ఆదిత్య. వీళ్లు టార్గెట్ చేసిన లిస్ట్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఇగ్నాజియో కసిస్, బిఎండబ్ల్యూ సహ వ్యవస్థాపకుడు స్టెఫన్ క్వాండ్ట్తో పాటు లండన్లోని ధనవంతుల కుటుంబాలు ఉన్నాయి. భారతీయ సంతతికి చెందిన మిలియనియర్ఆ అశోక్ హిందూజా పేరు కూడా వీళ్ల జాబితాలో ఉంది.
స్టింగ్ ఆపరేషన్తో గుట్టురట్టు
డెలాయిట్ ఇండియా సైబర్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు ఆదిత్య. గురుగ్రామ్లో తాను ఉండే నాలుగో అంతస్తులోని అపార్ట్మెంట్ కేంద్రంగా హ్యాకింగ్ కార్యకలాపాలు చేస్తున్నాడు. ఇతను ఏడేళ్లుగా హ్యాకింగ్ పాల్పడుతున్నాడని తెలిసింది. ఆదిత్య టీం హ్యింగ్కు ఉపయోగించే మలిషియస్ సాఫ్ట్వేర్ ప్రముఖుల కంప్యూటర్ కెమెరా, మైక్రోఫోన్లను హ్యాక్ చేస్తుంది. దాంతో, వాళ్ల రహస్యాలు, వివరాలు తెలుసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో భాగంగా ‘సండే టైమ్స్’ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో ఆదిత్య జైన్ హ్యాకింగ్కు పాల్పడుతున్నాడనే విషయం బయటపడింది.