అహ్మదాబాద్: భారత్తో డే/నైట్ టెస్టులో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న స్పీడ్స్టర్ ఇషాంత్ శర్మ అద్భుత బంతితో ఓపెనర్ డొమినిక్ సిబ్లే(0)ను ఔట్ చేశాడు. తొలి ఓవర్ను మెయిడిన్ చేసిన ఇషాంత్ తన తర్వాతి ఓవర్లోనే సిబ్లేను పెవిలియన్ పంపాడు.
ఇషాంత్ ఆఫ్సైడ్ వేసిన బంతిని సిబ్లే షాట్ ఆడగా బ్యాట్కు ఎడ్జ్ అయిన బంతిని సెకండ్ స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ అందుకున్నాడు. 5 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. జాక్ క్రాలే(15), జానీ బెయిర్స్టో(0) క్రీజులో ఉన్నారు.