తెలుగు ఇండస్ట్రీకి హన్సిక దాదాపుగా దూరమైంది. గడిచిన దశాబ్ద కాలంలో ఆమె తెలుగులో అరకొర సినిమాలే చేసింది. చివరి సారిగా సందీప్ కిషన్తో కలిసి 2019లో తెనాలి రామకృష్ణతో టాలీవుడ్ను పలకరించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. త్వరలోనే మై నేమ్ ఈజ్ శృతి సినిమాతో రాబోతోంది. ఈ సినిమా ఓపెనింగ్ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు మీకోసం..