వజ్రోత్సవ విశ్లేషణ
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి కరెంటు నిత్యావసర వస్తువు కాదు. దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,362 మెగావాట్లు మాత్రమే. అంటే ఇప్పటి హైదరాబాద్ నగర విద్యుత్ డిమాండ్లో సగానికి తక్కువ. అప్పటికీ గ్రామాలు విద్యుదీకరణకు నోచుకోలేదు. తలసరి విద్యుత్ వినియోగం 16 యూనిట్లు మాత్రమే. ఆ పరిస్థితుల నుంచి ప్రస్తుతం దేశ విద్యుత్రంగం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, వినియోగం కలిగిన దేశంగా అవతరించడంలో అప్పటి పాలకులు విశేష కృషిచేశారు. ఈ విషయంలో మాజీ ప్రధాని నెహ్రూ మార్గనిర్దేశనం, ముందుచూపును ప్రశంసించకుండా ఉండలేం.
అప్పట్లో విద్యుత్రంగంలో ప్రభుత్వరంగ వాటా 37 శాతమే. దేశాభివృద్ధికి ప్రధాన వనరు విద్యుత్ అని గుర్తించి 1950లో ప్రారంభమైన పంచవర్ష ప్రణాళికల్లో ఆ రంగానికి పెద్దపీట వేసింది నాటి ప్రభుత్వం.. ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించిన నిధుల్లో సుమారు 18-20 శాతం మేర ఈ రంగానికే కేటాయించేవారు. రాజ్యంగం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అంశంగా చేర్చబడిన విద్యుత్రంగ ప్రక్షాళన కోసం ‘ఎలక్ట్రిసిటీ సైప్లె యాక్ట్-1948’ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం కల్పించిన వెసులుబాటుతోనే రాష్ర్టాల విద్యుత్ అవసరాలను తీర్చడానికి అవసరమైన ఉత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలను నియంత్రించడానికి, అభివృద్ధి పరచడానికి రాష్ట్ర విద్యుత్ బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రాష్ర్టాల్లో ఇప్పటికే ఎలక్ట్రిసిటీ బోర్డులు కొనసాగుతుండగా కొన్ని రాష్ర్టాల్లో వాటిని జెన్కో, ట్రాన్స్కో డిస్కంలుగా విడదీశారు.
మొదటి పంచవర్ష ప్రణాళిక ఆఖరికి.. అంటే 1956లో 2,886 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 9వ పంచవర్ష ప్రణాళిక ముగిసేనాటికి 2002 మార్చి నాటికి 1,05,046 మెగావాట్లుగా అభివృద్ధి చెందింది. తలసరి విద్యుత్ వినియోగం కూడా 559 యూనిట్లకు చేరుకున్నది. ప్రస్తుతం దేశ తలసరి విద్యుత్తు వినియోగం 1,208 యూనిట్లుగా రికార్డయింది. ఉత్పత్తి సామర్థ్యం కూడా 404 గిగావాట్లకు చేరుకున్నది. 1969లో ‘రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్’ (ఆర్ఈసీ) ఏర్పరిచి అత్యధిక గ్రామాలకు కరెంటు అందించారు. మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభానికి ముందు 3,061 గ్రామాలే విద్యుత్ సౌకర్యానికి నోచుకున్నాయి. 1985 నాటికి 3,70, 332 గ్రామాలు, ఇప్పటికైతే నూటికి నూరు శాతం గ్రామాలు విద్యుదీకరణ గావించబడ్డాయని కేం ద్రం చెప్తున్నప్పటికీ అటవీ, పర్వత ప్రాంత గ్రామా లు కొన్ని మిగిలి ఉన్నాయని తెలుస్తున్నది.
వాస్తవానికి విద్యుత్ ఉత్పత్తికి 5వ పంచవర్ష (1974-79) ప్రణాళిక కాలంలో పెద్దపీట వేసింది కేంద్రం. ‘నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్’, ‘నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ లిమిటెడ్’ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు 1975లో నాందీ ప్రస్తావన జరిగింది. ప్రస్తుతం ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా 23 బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలతో 48,120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ఎన్టీపీసీ అంతర్జాతీయ గుర్తింపు సాధించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘నేషనల్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్’ను 1989లో స్థాపించగా ప్రస్తుతం ‘పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’గా దేశవ్యాప్త గ్రిడ్ అవసరాల కోసం పనిచేస్తున్నది.
స్వాతంత్య్రం సిద్ధించిన నాటి పరిస్థితులతో పో ల్చి చూసుకున్నప్పుడు విద్యుత్ రంగంలో చెప్పుకోదగిన అభివృద్ధిని సాధించినప్పటికీ విద్యుత్ అందని కుటుంబాలు, గిరిజన తండాలు ఇంకా మిగిలి ఉండటం శోచనీయం. దేశ రాష్ట్రపతి స్వగ్రామం ఇటీవలే విద్యుదీకరణకు నోచుకున్న విషయం తెలుసుకొని దేశ ప్రజలు ఆశ్చర్యపోయారు. మొన్నటి ఎండాకాలంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొన్న విద్యుత్ కోతలు, కరెంటు కష్టాలు మన వ్యవస్థల్లోని లోటుపాట్లను మరోసారి ఎత్తిచూపాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 404 గిగావాట్లు, 1,208 యూనిట్ల తలసరి వినియోగం బాగానే కన్పిస్తున్నప్పటికీ 215 గిగావాట్ల అవసరాలకే తట్టుకోలేకపోవడం, ఇటీవలే కేం ద్రం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ చట్టం విద్యుత్ను వ్యాపార వస్తువుగా మార్చనున్న ప్రమా దం వాస్తవ పరిస్థితిని వెల్లడిస్తున్నది. 70 ఏండ్లకు పైగా దేశ ప్రజ ల కష్టార్జితంతో నిర్మించుకున్న లక్షల కోట్ల రూపాయల వి ద్యుత్ వ్యవస్థలు ప్రైవేట్పరం చేసే దిశ గా పడుతున్న అడుగులు, చట్టాలు దేశ హితానికి మంచివి కావు.
భూగర్భజలాలపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే తెలంగాణ రైతాంగం రాష్ట్రం ఏర్పడేవరకు అష్టకష్టాలు పడ్డది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత ఎనిమిదేండ్లలో ప్రభుత్వం 7 లక్షల 35 వేల పంపుసెట్లకు కనెక్షన్లు ఇచ్చింది. దేశ తలసరి విద్యుత్ వినియోగం 1,208 యూనిట్లుగా ఉంటే తెలంగాణ రాష్ట్రం తలసరి విద్యుత్ 2,071 యూనిట్లు.
1920లోనే స్వయం విద్యుత్ ఉత్పత్తి సంస్థను కలిగి ఉండటమే కాకుండా అప్పటికే ట్యాంక్బండ్ను విద్యుదీకరణ చేసుకున్న నగరం హైదరాబాద్. భూగర్భజలాలపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే తెలంగాణ రైతాంగం రాష్ట్రం ఏర్పడేవరకు అష్టకష్టాలు పడ్డది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత ఎనిమిదేండ్లలో ప్రభుత్వం 7 లక్షల 35 వేల పంపుసెట్లకు కనెక్షన్లు ఇచ్చింది. దేశ తలసరి విద్యు త్ వినియోగం 1,208 యూనిట్లుగా ఉంటే తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2,071 యూనిట్లు.
ఎండకాలంలో దేశమంతా విద్యుత్ కోతలతో సతమతమవుతుంటే తెలంగాణ ప్రజలకు మాత్రం ఆ ఇబ్బంది లేదు. 404 గిగావాట్ల సామర్థ్యం ఉన్న మన దేశం 210 గిగావాట్ల డిమాండ్ను కూడా ఎందుకు తట్టుకోలేకపోతున్నదనే ప్రశ్నను ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం ముందుంచారు. దేశ ప్రజలకు విద్యుత్ కోతల శిక్షలు ఇంకెన్ని రోజులు. దార్శనికత అంటే అభివృద్ధి చేయడం, ప్రజల అవసరాలను తీర్చడం. దార్శనికత అం టే ప్రజలను కలిపి ఉంచడం. దార్శనికత అంటే ప్రజల ఆనందోత్సాహాలను స్వప్నించడం. దార్శనికత అంటే ప్రజల కోసం సంఘర్షించడం, సంస్కరించ డం. దార్శనికత అంటే ప్రజలను ప్రేమించడం. ఇప్పుడు తెలంగా ణ వెలిగిపోతున్నది. భారతదేశమూ వెలిగిపోవాలని స్వప్ని ద్దాం. జై తెలంగాణ, జై భారత్..!
తుల్జారాంసింగ్ ఠాకూర్
78930 05313