తాళ్లపాక చిన తిరుమలాచార్యుడు 16వ శతాబ్దంలో సంకీర్తన లక్షణం అనే గ్రంథంలో కృష్ణమాచార్య వచనాలను ‘పదములు’ అని పేర్కొని కృష్ణమాచార్యులు వచన వాంఙ్ఞయ ప్రథమాచార్యుడని, సంకీర్తన ప్రథమాచార్యుడని ప్రశంసించాడు. ఆయన శైలి కఠినంగా లేకుండా సరళం. వేదాంతాది విషయాలకన్నా భక్తి ప్రాధాన్యం ఎక్కువ. కృష్ణమాచార్యుల వచనాలను అనుకరిస్తూ తర్వాత కాలంలో చాలామంది కవులు వచనాలు రచించారు.
ఓరుగల్లు కోట శత్రువులకు దుర్బేధ్యంగా ఉండేది. ఆ నగరానికి ఏడు కోటలుండేవి. కంచుకోట, ఇటుక కోట, రాతికోట, పుట్టకోట (పుట్టమన్నుతో కట్టినది), భూమికోట, కంపకోట , గనికోట అని ఆ కోటలకు పేర్లుండేవి. ఇప్పుడు భూమి కోట, రాతికోట జాడలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఫిరంగిగుండ్లు తగిలినా మట్టికోట చెక్కు చెదరకుండ ఉండేదట. రాతికోట ప్రాకారంపైన దూరం దూరంగా డెబ్బయిరెండు బురుజులు ఉండేవట. బురుజులు విశాలంగా ఉండి మెట్లు ఉండేవట. బురుజుల్లో సైనికులు ఆయుధాలతో కాప లా కాసేవాళ్లట. ఇంత అబేధ్యమైన కోటను జయించటానికి దాదాపు పదేండ్ల (క్రీ.శ 1212-1323) మధ్యకాలంలో నెలలకొద్ది దాడులు సాగిస్తూ ఢిల్లీ సుల్తానులు ఎనిమిది సార్లు దండెత్తి వచ్చి యుద్ధాలు చేశారు. ఇంత సుదీర్ఘమైన కాలం పట్టింది ముస్లింలకు ఏకశిలానగరమైన ‘ఆంధ్రనగరి’ని జయించటానికి!
రేచర్ల పద్మనాయకుల సాహితీ వైభవం
సర్వసామాన్యంగా శూరుడు, వీరుడు యుద్ధవిద్యలలో ప్రవీణుడు పరిపాలనాదక్షుడైన చక్రవర్తి కాలంలోనే సామ్రాజ్యాలు కూలిపోవటం మనం చరిత్రలో చూస్తుంటాం. కాకతీయ రాజుల్లో చివరివాడైన రెండవ ప్రతాపరుద్రుడు వీరుడే గాక కవి సాహిత్యాభిమాని. అంటువంటి రాజుల కాలంలో ఢిల్లీ సుల్తానులు దక్షిణదేశంలో యాదవరాజ్యం గెల్చుకున్న తర్వాత వాళ్ల కన్ను సుసంపన్నమైన ఓరుగల్లు మీద పడింది. ఢిల్లీ సుల్తానులలో అల్లాఉద్దీన్ ఖిల్జీ మొదలుకొని మహ్మద్బిన్ తుగ్లక్ కాలం వరకు ఓరుగల్లు మీద దాడులు చేస్తూనే ఉన్నారు. ప్రతాపచరిత్ర, కలువచేరు శాసనాలను బట్టి ముస్లింలు ఓరుగల్లు మీదికి ఎనిమిది సార్లు దండెత్తారని తెలుస్తున్నది. ముస్లిం చరిత్రనేమో ఐదుసార్లు దండెత్తారని చెప్తున్నది. మొట్టమొదటిసారి క్రీ.శ. 1313లో అల్లా ఉద్దీన్ ఖిల్జీ పెద్ద సైన్యంతో తన సేనాధిపతిని ఓరుగల్లు మీదికి పం పాడు. అప్పుడు కాకతీయసైన్యం వాళ్లను ఓడించి తరిమేసింది. రెండవసారి మళ్లీ ముస్లిం సైన్యం ఓరుగల్లును నెలరోజులు ముట్టడి చేసింది. ప్రతాపరుద్రుడు వంద ఏనుగులు, కొంత ధనమును ఇచ్చి కప్పం చెల్లిస్తానంటూ ఓటమిని అంగీకరించాడు. కానీ కప్పం చెల్లించడం కొంతకాలం తర్వాత నిలిపివేయటంతో ముస్లింలు మళ్లీ దండయాత్ర చేశారు. ఈ మారు దండయాత్రలో ముట్టడి ఆరు మాసాలు జరిగింది. విసిగిపోయి ముస్లింలు తిరిగి వెళ్లిపోయారు. కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత ఢిల్లీ నుంచి కొత్త సైన్యం వచ్చి చేరడంతో వాళ్లు వెనుతిరిగి వచ్చి ఓరుగల్లుపై దాడిచేశారు. ఈ సారి కాకతీయ సైన్యం ముస్లింల దండయాత్రను ఎదుర్కోలేకపోయింది. ప్రతాపరుద్రుడు బందీ అయినాడు. అతన్ని ఢిల్లీకి తీసుకువెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో నర్మదా నదిలోకి దూకి ప్రాణత్యాగం చేశాడు.
కాకతీయుల పతనానంతరం సింగమనాయుడు, వేమారెడ్డి, ప్రోలయ నాయకుడు.. ముగ్గురు వీరులు కలిసి తమ సైన్యాన్ని మోహరించి తెలుగు ప్రాంతాల నుంచి తురుష్కులను పారదోలారు. ముగ్గురూ మూడు ప్రాంతాలను పంచుకున్నారు. సింగమనాయుడు ఆమనగల్లు రాజధానిగా, వేమారెడ్డి కొండవీటి రాజధానిగా, ప్రోలయ ఓరుగల్లు రాజధానిగా పరిపాలించారు.
సింగమనాయుడు ఆ తర్వాత రాచకొండను దుర్బేధ్యమైన కోటగా నిర్మించుకొని ‘రేచర్ల పద్మనాయక వంశం’గా అక్కడినుంచి పరిపాలించాడు. వేమారెడ్డి కొండవీటి నుంచి ‘రెడ్డిరాజులు’గా పరిపాలించారు. ప్రోల య నాయకుడు వార్ధక్య దశలో ఉండటంచేత ఎక్కువ కాలం పరిపాలించలేదు. క్రీ.శ. 1330లో గతించాడు. అతని తర్వాత అతని పినతండ్రి కొడుకు కాపయనాయకుడు పరిపాలించాడు.కాపయనాయకుడు కూడా ఉత్తరాంధ్రలోని రాజులతో యుద్ధాలు చేస్తూ ఎక్కువ కాలం జీవించలేదు.
రేచర్ల సింగమనాయుడి వంశం రేచర్ల రాజధానిగా ఒక శతాబ్దకాలం (క్రీ.శ. 1326-1482) తెలంగాణను పాలించారు. సాంస్కృతికంగా, సాహిత్యపరంగా తెలంగాణను ఆ రాజులు ప్రభావితం చేశారు. కాకతీయుల వలెనే ఈ రాజు లు తెలుగు కవులను అభిమానించినా, రాజులు మాత్రం సంస్కృతంలో గ్రంథాలు రచించారు. అనపోతనాయుడు (క్రీ.శ.1394-1421) ‘అభినవ రాఘవం’ అనే సంస్కృత నాటకంను రచించాడు. అనపోతని కొడుకు మాదానాయుడు వాల్మీకి రామాయణానికి ‘రాఘవీయం’ అనే వ్యాఖ్యను రచించాడు. రేచర్ల వంశంలో మూడవ సింగభూపాలునికి (క్రీ.శ. 1425-1482) సర్వజ్ఞ సింగభూపాలుడు అని పేరున్నది. అతడు పండితకవి. కవులను ఆదరించాడు. సర్వజ్ఞుడు అనేది అతని బిరు దు. ‘రసార్ణవ సుధాకరం’ అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ‘కవలయావళి’ అనే సంస్కృత నాటకాన్ని రచించాడు. దీనికి ‘రత్నపాంచాలిక’ అనే మరో పేరు కూడా ఉన్నది.
సింగమనాయకుని ఆస్థానంలో విశ్వేశ్వరుడు అనే ప్రసిద్ధ పండితుడున్నాడు. ఆయన ‘చమత్కార చంద్రిక’ అనే అలంకారశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. చమత్కారాన్ని కావ్య ఆత్మగా చెప్తూ ఒక నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. రెడ్డిరాజుల ఆస్థానంలో ఉన్న శ్రీనాథు డు.. ‘ఎట్లు మెప్పించెదో నన్ను ఇంక మీద/ రావు సింగమహీపాలు ధీవిశాలు; నిండుకొలువున నెలకొనియున్న నీవు/సరస సద్గుణ వికృతాంబు శారదాంబ’ అని జంకతూ సర్వజ్ఞ సింగభూ పాలుని ఆస్థానానికి వచ్చాడు.
రేచర్ల రాజుల కాలంలో గొప్ప సం స్కృత పండితుడు ప్రసిద్ధ వ్యాఖ్యాత అయిన మల్లినాథ సూరి ఉన్నాడు. మల్లినాథసూరి తండ్రి కపర్థి. ఆయన పండితుడు. వాళ్లది మెదక్ జిల్లాలోని ‘కొలిచెలమ’ గ్రామం. అదే ‘కోలాచలం’గా వారి ఇంటిపేరు అయ్యింది. కపర్ధి భరద్వాజ గృహ్యసూత్రానికి భాష్యం రచించాడు.
ఢిల్లీ సుల్తానులు దక్షిణదేశంలో యాదవరాజ్యం గెల్చుకున్న తర్వాత వాళ్ల కన్ను సుసంపన్నమైన ఓరుగల్లు మీద పడింది. ఢిల్లీ సుల్తానులలో అల్లాఉద్దీన్ ఖిల్జీ మొదలుకొని మహ్మద్బిన్ తుగ్లక్ కాలం వరకు ఓరుగల్లు మీద దాడులు చేస్తూనే ఉన్నారు. ప్రతాపచరిత్ర, కలువచేరు శాసనాలను బట్టి ముస్లింలు ఓరుగల్లు మీదికి ఎనిమిది సార్లు దండెత్తారని తెలుస్తున్నది. ముస్లిం చరిత్రనేమో ఐదుసార్లు దండెత్తారని చెప్తున్నది.
ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606