ఎల్లారెడ్డి రూరల్, జూలై 26: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసానిపేట్ గ్రామస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మ ద్యం విక్రయాలను నిషేధిస్తూ తీర్మానం చేశారు. గ్రామస్తులు ఆదివారం గ్రామంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక నుంచి బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.
మద్యం విక్రయించిన వారికి రూ. 50వేల జరిమానా విధించాలని తీర్మానించారు. గ్రామంలో మద్యం విక్రయించే బెల్టుషాపుల యజమానులను హెచ్చరిస్తూ గ్రామస్తులు నోటీసులు అందజేశారు. అలాగే మద్యం విక్రయాల నిషేధంపై పోస్టర్లను అతికించారు. మద్యం విక్రయాల నిషేధంపై స్థానిక ఎస్సై రాజుకు వినతిపత్రం అందజేశారు.