న్యూఢిల్లీ: కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ లైబ్రెరీ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 16 నాటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో తెలుగు రెండు ఖాళీలు ఉన్నాయి. ఈ యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ఫ్రం లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (ఎల్ఐఎస్) ఇంటర్న్షిప్ను 2021-22 విద్యా సంవత్సరానిగాను అందిస్తున్నారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 25
ఇందులో తెలుగు 2, ఇంగ్లిష్, హిందీ 3 చొప్పున, ఒడియా, గుజరాతి, తమిళం, కన్నడం, మళయాలం, మరాథీ 2 చొప్పున, అస్సామీ, ఉర్దూ 1 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పీజీ చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టును ఇంటర్ లేదా డిగ్రీలో తప్పనిసరిగా చదివి ఉండాలి. 2021, జూన్ 16 నాటికి 35 ఏండ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. అకడమిక్లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 16
వెబ్సైట్: nationallibrary.gov.in