హనుమకొండ చౌరస్తా, జూలై 22: కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తునట్లు పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో భాగంగా 25న జరగాల్సిన ఫార్మ్ డి మూడో సంవత్సరం పరీక్షను జూలై 28కి, 24న జరగాల్సినఫార్మ్ డి నాలుగో సంవత్సరం పరీక్షాను జూలై 27వ తేదీకి, 24 జరగాల్సిన ఎంఈడి నాలుగో సెమిస్టర్ పరీక్షా జూలై 31వ తేదీకి వాయిదా పడింది.
అలాగే జూలై 25వ తేదీన జరగాల్సిన బీటెక్ రెండో సెమిస్టర్ పరీక్షా ఆగష్టు 7కి, జూలై 25న జరగాల్సిన బి.ఫార్మసీ 6వ సెమిస్టర్ పరీక్ష 27వ తేదీకి, 25న జరగాల్సిన బి.ఫార్మసీ మూడో సంవత్సరం(రెండో సెమిస్టర్ )పరీక్ష జూలై 27వ తేదీ వాయిదా వేస్తునట్లు, పరీక్షా కేంద్రాలు, సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యార్థులు గమనించాలని అయన కోరారు.