నీలగిరి, జూన్ 17 : ఐదేండ్ల లోపు చిన్నారులందరిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ మర్రి జయమ్మ అన్నారు. బుధవారం నల్లగొండలోని 38 డివిజన్ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన భోదనను అందిస్తుందన్నారు. గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరించి అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కరంటోత్ సుశీల, కొంగరి విజయలక్ష్మీ, యశోద పాల్గొన్నారు.

చిన్నారులను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలి : ఐసీడీఎస్ సూపర్వైజర్ జయమ్మ