అమరావతి : ఆంధ్రప్రదేశ్ వైసీపీలో తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ రాజు స్పందించారు. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ వేదికలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాజీనామా ప్రకటనపై ఆయన మాట్లాడారు. జగన్ స్క్రిప్ట్ను విజయమ్మ చదివిందని విమర్శించారు. ‘విజయమ్మతో రాజీనామా కూడా కరెక్టే , అమ్మ రాజీనామా కూడా కరెక్టే న ’ని ఎద్దేవా చేశారు. అమ్మ రాజీనామా జగన్లో బాధ పడినట్లుగా తనకు కనిపించిందని అన్నారు.
ఆమె రాజీనామా రెండుకళ్ల సిద్ధాంతం చెప్పకనే చెప్పిందని విమర్శించారు. వీడ్కోలు సమావేశంలోనైనా ఆమెను గౌరవంగా పంపాల్సిఉండేదని అన్నారు. వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలికి చిన్న కూర్చీ వేసి అవమానించారని ఆయన పేర్కొన్నారు. గౌరవ అధ్యక్షురాలికి పెద్ద సీటు వేసితే జగన్ గౌరవం పెరిగేదని అన్నారు. షర్మిల పక్షం వహించేందుకు విజయమ్మ రాజీనామా చేస్తారని తాను ముందుగానే చెప్పానని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు జగన్ నెరవేర్చ లేదని విజయమ్మను నేరుగా కలిసి వివరిస్తానని, లేనిపక్షంలో లేఖ ద్వారానైనా తెలియజేస్తానని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో కట్టిన ఇండ్లకే వైసీపీ రంగులు వేస్తున్నారని పేర్నొన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు బెదిరింపులు, అరాచకాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భయపడుతున్నారని తెలిపారు.