హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మ ద్యం దుకాణాలకు లైసెన్సుల జారీ ప్రక్రియ మొదలైంది. అన్ని జి ల్లాల ఆబ్కారీశాఖ కార్యాలయాల్లో ఈ నెల 18 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనున్నది. 20న లాటరీ విధానంలో లైసెన్సుదారులను ఎంపిక చేయనున్నారు. కొత్తవి సహా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీచేయనున్నట్టు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అట్టడుగు వర్గాలవారు ఆర్థికంగా బలపడాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశంలోనే తొలిసారిగా మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు బ్యాంక్ గ్యారెంటీలను 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారని తెలిపారు.