న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ అయిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నిలిచిపోయాయి. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సేవలకు అంతరాయం కలిగింది. ఒక్కసారిగా యాప్లు పని చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే, యాప్లు పని చేయకపోవడానికి కారణాలు తెలియరాలేదు. వీలైనంత తర్వగా సమస్యను పరిష్కరిస్తామని ఫేస్బుక్ పేర్కొంది. అదే పనిలో ఉన్నామని, సేవల్లో అంతరాయానికి చింతిస్తున్నట్లు ఫేస్బుక్ వెబ్సైట్లో పోస్టు పెట్టింది. భారత్లో రాత్రి తొమ్మిది గంటల నుంచి సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు పలువురు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం.. ఇప్పటి వరకు 30వేలకుపైగా జనం వాట్సాప్ సమస్య గురించి తెలిపారు. ఇన్స్టాగ్రామ్పై 18,970 మంది, ఫేస్బుక్పై 6900 మందికిపైగా సమస్య గురించి పేర్కొన్నారు.