బ్లూమ్ఫాంటైన్: టాపార్డర్ బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా-‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్-‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. హనుమ విహారి (45 బ్యాటింగ్), ఇషాన్ కిషన్ (49), పృథ్వీ షా (42), సర్ఫరాజ్ ఖాన్ (30 బ్యాటింగ్) రాణించారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 233/7తో బుధవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా-‘ఎ’ 297 పరుగులకు ఆలౌటైంది. మార్కో జాన్సెన్ (70) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో నవ్దీప్ సైనీ, ఇషాన్ పొరెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. చేతిలో ఐదు వికెట్లు ఉన్న భారత జట్టు ప్రస్తుతం ప్రత్యర్థి స్కోరుకు 99 పరుగులు వెనుకబడి ఉంది.