నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మడిపెల్లి భద్రయ్యను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. బతుకుబాట, వాసర జ్ఞాన సరస్వతిస్తవం పుస్తకాలను రాసి మన భాష, మన యాస, వ్యవహారిక భాష పదాలతో మడిపెల్లి భద్రయ్య రాశారు. ఈ పుస్తకాలను ఉప రాష్ట్రపతికి పంపించారు. వాటిని పరిశీలించిన అనంతరం అభినందనలు తెలుపుతూ ఉపరాష్ట్రపతి ప్రశంసపత్రాన్ని మడిపెల్లి భద్రయ్యకు పంపించారు. ఇలాంటి కవుల వలన దేశంలో భాష, యాస, సంస్కృతి భావితరాలకు అందించే అవకాశం ఉందని కొనియాడారు.