న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2021 పరీక్షా ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు upsc.gov.in వెబ్సైట్లో ఫలితాలు చూడవచ్చు. ఈ ఏడాది జూన్ 27న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని తొలుత షెడ్యూల్ ప్రకటించగా, కరోనా కారణంగా అక్టోబర్ 10న నిర్వహించారు. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన వారికి వచ్చే ఏడాది జనవరి 7-16 మధ్య మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.