లక్నో: యూపీలో ఓ ప్రభుత్వ టీచర్ క్లాస్రూమ్లోనే విద్యార్థితో మసాజ్ చేయించుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. హర్దోయ్లోని పోఖరి ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. విద్యార్థితో మసాజ్ చేయించుకున్న మహిళ టీచర్ను సస్పెండ్ చేశారు. కూర్చీ మీద కూర్చున్న టీచర్ ఎడమ చేతికి ఓ విద్యార్థి మసాజ్ చేశాడు. క్లాస్రూమ్లోని మిగితా పిల్లలు ఎవరిపనిలో వారున్నారు. అయితే మసాజ్ చేస్తున్న వీడియోను గుర్తు తెలియని వ్యక్తి తీశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. పిల్లవాడు చేతికి మసాజ్ చేస్తుండగా ఆ టీచర్ బాటిల్తో నీళ్లు తాగుతోంది. ఆ టీచర్ను ఉర్మిళా సింగ్గా గుర్తించారు. ఫోఖరి ప్రైమరీ స్కూల్లో ఆమె అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తోంది.
Teacher having bicep Massage by students, Viral video from Hardoi UP govt school. pic.twitter.com/MF8lEQPvEZ
— Grading News (@GradingNews) July 27, 2022