హైదరాబాద్, నవంబర్ 19: ప్రభుత్వరంగ బ్యాంకుల సంస్కరణల అమలులో యూనియన్ బ్యాంక్ మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను 12 పీఎస్బీల్లో ఈజీ 4.0 సంస్కరణల ఇండెక్స్ అమలులో ఈ స్థానం లభించినట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) వెల్లడించింది. ఈజీ సంస్కరణల అమలులో బ్యాంక్ కీలక చర్యలు తీసుకున్నదని, గత మూడు త్రైమాసికాలుగా పలు చర్యలు తీసుకుంటున్నదని ఐబీఏ తెలిపింది.