కీవ్: ఉక్రెయిన్ గూఢాచార సంస్థ ఎస్బీయూ చీఫ్ ఇవాన్ బకనోవ్తో పాటు ఆ దేశ ప్రాసిక్యూటర్ జనరల్ ఇరినా వెనిడిక్టోవాపై దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వేటు వేశారు. దేశ ద్రోహం కేసుల కింద ఆ ఇద్దర్ని సస్పెండ్ చేస్తూ జెలెన్స్కీ ఆదేశాలు ఇచ్చారు. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లో సుమారు 60 మంది మాజీ ఉద్యోగులు ఉక్రెయిన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా సుమారు 651 దేశద్రోహ కేసులు నమోదు అయినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. సస్పెన్షన్పై ఇద్దరు అధికారులు ఇంకా స్పందించలేదు. ఇద్దర్నీ తొలగించలేదని, కానీ వారిపై విచారణ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో పక్కనపెట్టినట్లు జెలెన్స్కీ అడ్వైజర్ తెలిపారు.