హైదరాబాద్ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఆర్జేసీ-సెట్) 2021 ఫలితాలను బుధవారం ప్రకటించింది. పదో తరగతి గ్రేడ్ల ఆధారంగా ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను వెల్లడించింది. 126 కళాశాలలో మొత్తం 10,800 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థుల జాబితా https://tswreis.in/ and https://www.tswreis.ac.in/. వెబ్సైట్లలో అందుబాటులో ఉంది. అభ్యర్థులు హాల్ టికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, సెలక్షన్ కాపీ, టీసీ, ఇన్కం సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో జూన్ 25 నుండి జులై 7 మధ్య సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిందిగా సొసైటీ తెలిపింది.