ముఖ్య పథకాలు కేటాయింపులు (రూ. కోట్లలో)
రైతుబంధు 14,800
ఆసరా 11,728
రైతు రుణమాఫీ 5,225
రెండు పడక గదుల ఇళ్లు 11,000
వడ్డీలేని రుణాలు (పట్టణ, గ్రామీణ) 3,000
విద్యుత్ రాయితీ 10,500
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ 2,750
ప్రభుత్వ పాఠశాలలు 4,000
రాష్ట్ర బడ్జెట్ను మార్చి 18న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్రావు ప్రవేశపెట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం ఇది. 96 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. మొత్తం రూ.2,30,825.96 కోట్ల ఆదాయ, వ్యయ అంచనాలను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంతరెడ్డి వరుసగా రెండో ఏడాది బడ్జెట్ను సమర్పించారు. గత బడ్జెట్ కంటే ఈసారి బడ్జెట్ 25 శాతం అధికం. ఈసారి బడ్జెట్లో సీఎం దళిత సాధికారత పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. పోటీపరీక్షల్లో బడ్జెట్, ఆర్థిక సర్వేపై ప్రశ్నలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ వివరాలు పరీక్షల కోణంలో నిపుణ పాఠకుల కోసం….
వ్యవసాయ రంగం
ప్రధానరంగమైన వ్యవసాయానికి ప్రభుత్వం రూ.25వేల కోట్ల భారీ నిధులు కేటాయించింది. గతేడాది కంటే సుమారు రూ.వెయ్యికోట్లు అధికంగా నిధులు ఇచ్చింది. వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సాహానికి రూ.1500 కోట్లు ప్రతిపాదించింది. గత ఐదేండ్లలో 14,644 ట్రాక్టర్లను రైతులకు సబ్సిడీపై అందించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్ల నిధులు ఇవ్వనున్నది.
రైతుబంధు
రైతుబంధుకు గతేడాది రూ.14వేల కోట్లు కేటాయించగా ఈ ఏడాది అదనంగా రూ.800 కోట్లు కలిపి 14,800 కోట్లు కేటాయించింది. గత మూడేండ్లలో ఈ పథకం కింద రైతుకు రూ.35,911 కోట్లు అందించినట్టు తెలిపింది.
రైతుబీమా
రైతుబీమా కోసం రూ.1200 కోట్లు కేటాయించింది. గతంతో పోల్చితే రూ.60 కోట్లు ఎక్కువగా కేటాయించారు. గుంట భూమి ఉన్నా రైతుబీమాకు అర్హులుగా పేర్కొనడంతో పాలసీదారుల సంఖ్య పెరుగుతుంది. గత మూడేండ్లలో వివిధ కారణాలతో మరణించిన సుమారు 46,564 రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.2328 కోట్లను బీమా సాయంగా అందజేసింది.
పౌరసరఫరాల శాఖ
పౌరసరఫరాలశాఖకు మొత్తం రూ.2,363 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.64.73 కోట్లు, ప్రగతిపద్దు కింద రూ.1,444.14 కోట్లను కేటాయించింది. ప్రగతిపద్దులో అధికశాతం రేషన్ బియ్యం పంపిణీకి ఖర్చు చేయనున్నది. పశు సంవర్ధకశాఖకు రూ.1730 కోట్లను కేటాయించింది.
రైతు రుణమాఫీ
రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.5,225 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రూ.25 వేలలోపు రుణాలను మాఫీచేసిన ప్రభుత్వం తాజాగా.. ఆపై రుణాలను కూడా మాఫీచేయనున్నది. వ్యవసాయరంగంలో పరిశోధనలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు కేటాయించింది.
గొర్రెల పంపిణీకి
రెండోవిడత గొర్రెల పంపిణీకి రూ. 3వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 7.31 లక్షల మందిని గొర్రెల పంపిణీ పథకానికి అర్హులుగా ప్రభుత్వం గతంలోనే తేల్చింది.
నీటిపారుదల
సాగునీటి రంగానికి రూ.16,931కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ పద్దు రూ.10,507 కోట్లు కాగా, ప్రగతి పద్దు రూ.6,424 కోట్లుగా చూపింది. గతేడాది కేటాయింపులతో పోల్చితే ఈసారి 50శాతం వరకు పెరిగాయి. డిండి ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేందుకు రూ.545 కోట్లు, ఎస్ఎల్బీసీకి రూ.331 కోట్లు వెచ్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 13 ఎత్తిపోతల పథకాలకు ఒకేసారి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వీటికి ప్రత్యేకంగా రూ.2,395 కోట్లు విడుదల చేస్తూ అప్పట్లోనే ఉత్తర్వులు జారీ చేసింది.
మిషన్ కాకతీయ
మిషన్ కాకతీయకు రూ.751 కోట్లు కేటాయించింది. టీఎస్ఐడీసీకి రూ.252.98 కోట్లు, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల నిర్వహణకు రూ.13 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది మొత్తంగా నీటిపారుదల రంగంలో రూ.30 వేల కోట్ల వరకు వెచ్చించాలని ప్రభుత్వం భావిస్తుంది. బడ్జెట్లో దాదాపు రూ.17వేల కోట్లు కేటాయించగా.. మరో రూ.13 వేల కోట్ల వరకు రుణాలు సమీకరించే అవకాశం ఉన్నది.
మహిళా సంఘాలకు
మహిళా సంఘాలకు రూ.3వేల కోట్లు కేటాయించింది. ప్రతి సంఘం రూ.5 లక్షల వరకు తీసుకునే రుణాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే మహిళా సంఘాలకు చెల్లిస్తుంది. మహిళా సంఘాలకు టర్మ్ లోన్, క్యాష్ క్రెడిట్ లిమిట్ ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. రాష్ట్రంలో 4.29లక్షల మహిళా సంఘాలున్నాయి. ఇందులో 46.65 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరికి ఈ ఏడాది వివిధ బ్యాంకుల ద్వారా రూ.9,803 కోట్ల రుణాలు అందించారు. కాగా, ఈ రుణాల రికవరీ శాతం 97.25 శాతం ఉన్నది. ఏ రంగంలో చూసినా.. బ్యాంకు రుణాల తిరిగి చెల్లింపుల్లో ఇంతశాతం రికవరీ ఎక్కడా లేదు. దీంతో బ్యాంకులు కూడా మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి.
మున్సిపల్ శాఖ
మున్సిపల్శాఖకు రూ.15,030 కోట్లు కేటాయించింది. పట్టణాల్లో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి రూ.500 కోట్లు, వైకుంఠ ధామాల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించింది. వరంగల్ నగరాభివృద్ధికి రూ.250కోట్లు, ఖమ్మం నగరానికి రూ.150 కోట్లు, హైదరాబాద్ మెట్రోకు రూ.1000 కోట్లు ప్రతిపాదించింది. మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధికి రూ.200 కోట్లు, హైదరాబాద్లో ఉచిత మంచినీటి పథకం కోసం జలమండలికి రూ.250 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ భవిష్యత్ నీటి అవసరాల కోసం రూ.725 కోట్లు, ఓఆర్ఆర్ లోపలి గ్రామాలకు నీటి సరఫరాకోసం రూ.250 కోట్లు ప్రతిపాదించారు. పట్టణాల్లోని మహిళా స్వయంసహాయక సంఘాలకు రూ.566 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్కు రూ.783 కోట్లు, అమృత్ పథకం అమలుకు రూ.203 కోట్లు, స్మార్ట్ సిటీలకు రూ.288 కోట్లు కేటాయించింది. టీయూఎఫ్ఐడీసీకి రూ.219 కోట్లు, నీటి సరఫరా, నిర్వహణకు రూ.803 కోట్లు ప్రతిపాదించింది.
పంచాయతీరాజ్శాఖ
పంచాయతీరాజ్శాఖకు రూ.29,271 కోట్లు ప్రతిపాదించింది. వీటిలో ప్రధానంగా ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు, స్వయం సహాయక సంఘాల వడ్డీ లేని రుణాలకు రూ.3 వేల కోట్లు కేటాయించింది. జిల్లా పరిషత్ రూ.252 కోట్లు, మండల పరిషత్తులకు రూ.248 కోట్లు ప్రతిపాదించింది. నిర్వహణ పద్దు కింద రూ.6,898 కోట్లను కేటాయించింది. రోడ్లు, వంతెనలకు రూ.300 కోట్లు, నీటి నిర్వహణ, శానిటేషన్కు రూ.2,366 కోట్లు, గ్రామపంచాయతీలకు రూ.1,736 కోట్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్యోజన (పీఎంజీఎస్వై)కు రూ.541 కోట్లు, గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణానికి రూ.150 కోట్లు, మిషన్ భగీరథకు రూ.1,366 కోట్లు కేటాయించింది. సెర్ప్లోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1,698 కోట్లు, ఉపాధి హామీ పనులకు రూ.1,471కోట్లు ప్రతిపాదించింది.
సమగ్ర భూ సర్వే
భూముల సమగ్ర సర్వే కోసం రూ.400 కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములను అత్యాధునిక పద్ధతుల్లో కొలిచి ప్రతి కమతానికి, ఇంటికి, ఆస్తికి అక్షాంశ, రేఖాంశాలు (కో ఆర్డినేట్స్) కేటాయించనున్నారు. భూ రికార్డులు పారదర్శకంగా, డిజిటలైజ్ అయిన చోట జీడీపీ 3- 4% పెరుగుతుందని, నేరాలు తగ్గుతాయని, వ్యవసాయం పెరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా అనుభవాలు చెబుతున్నాయి. తెలంగాణ భూ విస్తీర్ణం 2.77 కోట్ల ఎకరాలు. ఇందులో 1.60 కోట్ల ఎకరాలు వ్యవసాయభూమి, 67 లక్షల ఎకరాలు అటవీ భూమి, సుమారు 36 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి, మిగతావి ఆవాస ప్రాంతాలు, దేవాలయ, వక్ఫ్ భూములుగా ఉన్నాయి. ‘ధరణి’ పోర్టల్ నిర్వహణకు రూ.47.62 కోట్లు కేటాయించింది.
నీరా పాలసీ
గీత కార్మికుల సంక్షేమానికి తెచ్చిన నీరా పాలసీకి రూ.25 కోట్లు, ఆబ్కారీశాఖకు రూ.44 కోట్లను కేటాయించారు. ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కింద రూ.5 కోట్లు కేటాయించారు.
షీ టాయిలెట్స్ కోసం
రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, విశ్వవిద్యాలయాల్లో మహిళా సిబ్బంది సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం షీ టాయిలెట్లను నిర్మించనున్నది. పోలీస్ స్టేషన్లలో వీటి నిర్మాణానికి రూ.20 కోట్లు, యూనివర్సిటీల్లో రూ.10 కోట్లు మొత్తం రూ.30 కోట్లు కేటాయించింది.
దళితుల అభివృద్ధికి
రూ.1000 కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం’కు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ బడ్జెట్లో కేటాయించిన ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (రూ.21,306.85 కోట్లు)కి ఈ వెయ్యి కోట్లు అదనం. ఎస్సీ కుటుంబాలకు వ్యవసాయ యాంత్రీకరణ, మినీ డెయిరీల ఏర్పాటు వంటి స్వయం ఉపాధికి తోడ్పాటును అందించడం సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం ప్రధాన ఉద్దేశం.
కల్యాణలక్ష్మి
కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకానికి రూ.2,750 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 8,04,521 మంది లబ్ధిపొందారు. కల్యాణలక్ష్మిలో బీసీల దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్లో అదనంగా రూ.500 కోట్లు ప్రతిపాదించింది.
ఆర్టీసీ
రూ.3,000 కోట్లు కేటాయించారు. ఇందులో బడ్జెటేతర నిధులు రూ.1,500 కోట్లు ఉన్నాయి.
పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యలకు కలిపి మొత్తం రూ.13,886 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు రూ.11 వేల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించారు. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్కు రూ.75.71 కోట్లు, ఇంటర్ విద్యకు నిర్వహణ పద్దు కింద రూ.462 కోట్లు, అడ్మిషన్ ఫీజుల మాఫీ, ఉచిత పాఠ్యపుస్తకాలు, ప్రయోగశాల పరికరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీల నిర్మాణానికి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి మొత్తం రూ.49.18 కోట్లు కేటాయించారు. కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల ప్రహరీల నిర్మాణానికి రూ.10 కోట్లు, అసంపూర్తిగా ఉన్న మోడల్ స్కూల్స్ భవనాల నిర్మాణానికి రూ.2.76 కోట్ల, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలు, కళాశాలల్లో అదనపు వసతుల కల్పనకు రూ.69.96 కోట్లు వెచ్చించనున్నారు.
ఆర్ఆర్ఆర్ భూసేకరణ
ఔటర్రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల అవతల 348 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు రూ.750 కోట్లు ప్రతిపాదించారు. ఆర్ఆర్ఆర్ను జాతీయ రహదారుల కింద చేపట్టాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో 50 శాతాన్ని భరించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు భూసేకరణ కోసం ఈ బడ్జెట్లో రూ.750 కోట్లు ప్రతిపాదించింది.
చేనేత కార్మికులకు
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.338 కోట్లు కేటాయించింది. 95.25 లక్షల బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాం అర్డర్లను ఇవ్వడం ద్వారా సుమారు 20 వేలమంది నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది. చేనేత కార్మికులకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి రూ.461 కోట్ల విలువైన ఆర్డర్లు అందాయి.
పరిశ్రమల శాఖ
పరిశ్రమల శాఖకు రూ.3,077 కోట్లు కేటాయించారు. గ్రామీణ, చిన్న పరిశ్రమలకు రూ.1,379.78 కోట్లు, పెద్ద, మధ్య తరహా పరిశ్రమలకు రూ.1,141కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించారు. గత బడ్జెట్లో రూ.1,570 కోట్లు కేటాయించారు. టీఎస్-ఐపాస్ ద్వారా గడిచిన ఆరేండ్లలో 15,252 పరిశ్రమల స్థాపనకు అనుమతులు జారీచేశారు. దీనివల్ల రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 15.51 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. గనులు, ఖనిజాల అభివృద్ధికి రూ.127 కోట్లు కేటాయించారు.
ప్రభుత్వ పాఠశాలలు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం రూ.4 వేల కోట్లు కేటాయించింది. ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున రెండేండ్లలో అన్ని పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో మౌలికవసతులు కల్పిస్తారు.
విభాగాల వారీగా కేటాయింపులు (రూ.కోట్లలో..)
పాఠశాల విద్యకు రూ.11,735
ఉన్నతవిద్యకు రూ.1,873
సాంకేతిక విద్యకు రూ. 278
ప్రగతి పద్దు.. (రూ.కోట్లలో..)
(నిర్వహణ పద్దు మినహాయించగా)
పాఠశాల విద్యాశాఖ 612. 08
ప్రభుత్వ పరీక్షల విభాగం 12. 95
సమగ్రశిక్షా అభియాన్ 1,150
తెలంగాణ గురుకుల
విద్యాలయాల సంస్థలు 32.61
గ్రంథాలయాలు 61.13
ఉన్నత విద్య 13.25
కాలేజీ భవన నిర్మాణాలకు 106.40
ఇంటర్ విద్య 49.18
వయోజన విద్య 6.5
ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాసంస్థ 33. 82
సాంకేతిక విద్య 13.17
మధ్యాహ్న భోజన పథకానికి 609.32
వయోజన విద్య పరిధిలో అమలుచేస్తున్న ‘పఢ్నా లిఖ్నా అభియాన్’కు రూ.6.5 కోట్లు కేటాయించారు. 2011 జనాభా లెక్కల్లోని అక్షరాస్యత ప్రకారం తెలంగాణలోని ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్భూపాలపల్లి జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో 15 ఏండ్లు దాటినవారికి అక్షరాస్యత కార్యక్రమాలను అమలుచేయనున్నారు.
యూనివర్సిటీలకు రాష్ట్రంలో 9 యూనివర్సిటీలకు రూ.551 కోట్లు కేటాయించారు.
డబుల్ బెడ్రూం
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ.11 వేల కోట్లు కేటాయించారు. ఇందులో ప్రగతిపద్దులో రూ.7,219.70 కోట్లు, నిర్వహణ పద్దులో రూ.1,529.68 కోట్లుగా చూపించారు.
వైద్యారోగ్యశాఖ
వైద్యారోగ్యశాఖకు రూ.6,295 కోట్లు కేటాయించారు. ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమం స్టేట్ సెక్టార్ పథకాలకు రూ.192.33 కోట్లు కేటాయించింది. కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడికి రూ.329.91 కోట్లు ప్రతిపాదించారు.
విద్యుత్తు రంగం
విద్యుత్తు రంగానికి రూ.11,046 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.7,811.19 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయం, ఇతర రంగాలకు విద్యుత్తు సబ్సిడీ కోసం రూ.7,665 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే సబ్సిడీలకు అదనంగా రూ.120 కోట్లు ఇచ్చారు.
హరీష్రావు ఉటంకించిన కవితలు, మాటలు‘ఏదీ సులభమ్ముగా రాదు లెమ్ము’‘ధ్యేయమును బట్టి ప్రతి పని దివ్యమగును’
‘ధ్యేయం పట్ల నిలువెల్లా అంకితభావం కలిగిన వ్యక్తులే సమాజాన్ని ముందుకు నడిపిస్తారు’
‘వ్యక్తికి స్వావలంబన చేకూర్చేదే నిజమైన విద్య’
‘విద్య లేకపోవడం వల్లనే వెనుకబడిన తరగతులు అణచివేతకు గురవు-తాయి’