హైదరాబాద్ : తెలంగాణ భవన్లో గురువారం జెండా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత పర్యాద కృష్ణమూర్తి గులాబీ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీక్షణం ప్రజాహితం కోసం పరితపించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. టీఆర్ఎస్ సీనియర్ నేత టీ. రామాంజన్, రాష్ట్ర కార్యదర్శి ఎం. మధన్ గౌడ్తో పాటు పలువురు నేతలు తెలంగాణ భవన్లో జరిగిన జెండా పండుగలో పాల్గొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాల్లో వార్డు వార్డునా టీఆర్ఎస్ నేతలు గులాబీ జెండాను ఎగుర వేసి జెండాపండుగను ఘనంగా నిర్వహించారు. పార్టీ బాధ్యతలు టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించి. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన జెండా పండుగలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి హాజరయ్యారు. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా గులాబీ జెండాలను ఆవిష్కరించారు. నర్సంపేట పట్టణంలో టీఆర్ఎస్ జెండా జెండాను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎగురవేశారు. టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.