వనస్థలిపురం, డిసెంబర్ 6: కోట్లాది కుటుంబాలకు ఆసరాగా ఉండే జీవిత బీమా సంస్థకు ఏజెంట్లు ఆత్మలాంటి వారని త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామీ జీ అన్నారు. ఎల్ఎఐసీ ఏజెంట్ల సంఘం లియాఫీ హైదరాబాద్ డివిజన్ 18వ సర్వసభ్య సమావేశం సాగర్ రిం గ్రోడ్లోని కేకే గార్డెన్లో జరిగింది. కార్యక్రమానికి స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరై సందేశమిచ్చారు. పేద, ధనిక తేడా లేకుండా అందరి కీ బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. ప్రతి కుటుం బం బీమా కోసం కొంత ధనాన్ని కేటాయించుకోవాలని సూచించారు. రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఉత్సవాలు ఫిబ్రవరి 2 నుంచి 12వ తేదీ వరకు ముచ్చింతలలో జరుగుతాయని స్వామిజీ తెలిపారు. కార్యక్రమంలో సింగారపు శ్రీనివాస్, శ్యామ ల్ చక్రవర్తి, శ్రీనివాస్, సీతయ్య, వెంకట్రెడ్డి, సుదర్శన్, కటకం కృష్ణయ్య పాల్గొన్నారు.