అమరావతి : కృష్ణా జిల్లాలో విషాదం చోటు చోటుకుంది. చేసిన అప్పులు తీర్చలేక ఓ చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. జిల్లాలోని పెడనలో పద్మనాభం(52), లీలావతి(45), కుమారుడు రాజా నాగేంద్ర(25) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులు, అప్పులుతీర్చలేక ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐదు నెలల క్రితం పద్మనాభం, లీలావతి దంపతులు కుమార్తెకు వివాహం చేశారు. ఎంతవరకు అప్పులు ఉన్నాయనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.