నగరం చుట్టూ ఉన్న పర్యాటకాన్ని ఆస్వాదించడానికి టూరిస్టులు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కరోజులో వెళ్లొచ్చేలా పర్యాటకులు నగరం నలుమూలల ఉన్న పర్యాటక ప్రాంతాలను ఎంచు
కుంటున్నారు. ముఖ్యంగా పచ్చని రంగులేసినట్టున్న కొండలు, చిట్టడవులు, చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి సై అంటున్నారు. సెలవు దొరికితే చాలు పర్యాటకానికి పరుగులు తీస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే స్నేహితులు, బంధువులతో నచ్చిన ప్రదేశాలను ఎంపిక చేసుకుని ప్రకృతి ఒడిలో సేద తీరి వస్తున్నారు. సీజన్ బట్టి యాత్ర ప్రదేశాలను మార్చుకుంటూ రీఫ్రెష్ అవుతున్నారు. నగరానికి దగ్గర్లోని అనంతగిరి, భువనగిరి, రాచకొండ, దేవరకొండలను వీక్షించడానికి ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి.. సుందరమైన దృశ్యాలను ఆస్వాదించడానికి నగరం నుంచి కొన్ని విహారయాత్రలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..!!
వికారాబాద్ జిల్లాలో ఉన్న సుందరమైన అనంతగిరి కొండలు. హైదరాబాద్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండల చుట్టూ దట్టమైన అడవులు. ఈ పచ్చటి ప్రాంతాల్లో ట్రెక్కింగ్ అనేది ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా ఉంది. పురాతన గుహలు, మధ్యయుగ కోట వంటి నిర్మాణాలు ఉన్నాయి. మంచి రోడ్లు, వసతులు ఉన్నాయి. వికారాబాద్ నుంచి 10 కిలో మీటర్లు వెళితే అనంతగిరి చేరుకోవచ్చు. స్వచ్ఛమైన గాలి, చూడచక్కని వ్యూ పాయింట్స్ అందరిని ఆకర్శిస్తున్నాయి.
అత్యంత ప్రసిద్ధ ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ కోటను మొదట త్రిభువనగిరి అని పిలిచేవాళ్లు. నగరం నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. 300 అడుగుల రాక్ ఫేస్పైకి ఎక్కడం..ఆపై ఉపరితలంపైన ైక్లెంబింగ్ చేయొచ్చు. ఇక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన అడ్వెంచరీ స్పోర్ట్ యాక్టివిటీ ఉంది. రాక్ ైక్లెంబింగ్ ఉంది. రైళ్లు, రోడ్డు మార్గాలు ఈ కోటకు అనుసంధానించబడి ఉండటం వలన ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
నగరం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటకు గొప్ప చరిత్ర ఉంది. ఇది 13 నుంచి 14వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ కోట ఒక కొండ పైభాగంలో ఉంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి వెళ్లే మార్గంలో ఉంది. నగరవాసులు దేవరకొండకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కుటుంబ సమేతంగా వెళ్లి ఆహ్లాదంగా గడుపుతున్నారు.
నగరం నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉంది అందమైన రాచకొండ కోట. శీతాకాలంలో ఈ కోటను సందర్శిస్తే మరింత అనుభూతి ఉంటుంది. ఈ కోటను సందర్శించడానికి నగరవాసులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటారు.
మార్చి నెలలో విహార యాత్రికులు ఉత్తర్ప్రదేశ్లోని బృందావన్ పర్యటన చేయాలని భావిస్తారు. ఏప్రిల్లో పర్వత ప్రాంతాలైన సిక్కిం, డార్జిలింగ్కు వెళుతుంటారు. అక్కడి అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. హిమాలయాల ఒడిలో ఒదిగి ఉన్న ప్రదేశాలను వీక్షించాలని ఆసక్తి చూపిస్తారు. మేలో హిమాచల్ పర్యటన, ఆగస్టులో కేరళ, వర్షాకాలంలో గోవా పర్యటన చేయడం, అక్టోబర్లో శీతాకాలానికి స్వాగతం చెప్పే ప్రకృతి అందాలను తనివి తీరా చూడటానికి ఆసక్తి చూపడం, నవంబర్ సీజన్లో మున్నార్, ఊటీ, తెక్కడి, పశ్చిమబెంగాల్లోని సుందరమైన బీచ్లను ఆస్వాదించడం.. డిసెంబర్లో న్యూ ఇయర్ వేడుక టూర్లు..గోవా, థాయ్లాండ్ను ఎంచుకుంటారు. ఇలా నెలను బట్టి విహార ప్రదేశాలను ఎంచుకుని ఆస్వాదించేవాళ్లు కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నామంటే చాలు ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలి? విహారయాత్రలకు ప్రణాళికలు ముందుగానే వేసుకుంటారు చాలా మంది.
కొవిడ్ కారణంగా నాలుగు గోడల మధ్యనే కాలం కరిగి పోతుంది. పిల్లలు, బంధువులతో ఆనందంగా గడపడం టూర్లతోనే సాధ్యమవుతుంది. అందుకే పిల్లలను అనంతగిరికి తీసుకెళ్లాం. అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించి ఆనందంగా గడిపాం. వీకెండ్ వస్తే తప్పనిసరిగా ఒక టూర్ ప్లాన్ చేసుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఈ వీకెండ్లో భువనగిరికి వెళ్లాలని ప్లాన్ చేశాం. పిల్లలు చాలా సంతోషంగా గడిపి రీఫ్రెష్ అవుతారు. బీజీ లైఫ్లో టూర్లు చాలా రిలాక్స్ ఇస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి.
వారం రోజుల క్రితం స్నేహితులతో కేరళ, కశ్మీర్, కర్ణాటక, పుణె టూర్కు వెళ్లాం. చాలా ఆనందంగా అనిపించింది. అయితే నగరం చుట్టూ పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నాకు భువనగిరి ైక్లెంబింగ్ చాలా ఇష్టం. ఎంత దూరం వెళ్లినా నగరం చుట్టూ ఉన్న పచ్చని అందాలు ఇచ్చే కిక్కు అక్కడ దొరకదు. ఒక్కరోజులో వెళ్లి హాయిగా గడిపి రావొచ్చు. సొంత వాహనాలలో వెళ్లడం మంచిది.- మధు, సాఫ్ట్వేర్ ఉద్యోగి.
రెండు, మూడు రోజులు సెలవులు ఉంటే గోవా, వైజాగ్, కర్ణాటక, కేరళ తదితర రాష్ర్టాల్లోని పర్యాటక ప్రదేశాలను ఆస్వాదించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అవసరమైతే విమాన యాత్రలు కూడా చేస్తారు. సింగపూర్, బ్యాంకాక్, దుబాయ్ తదితర ప్రాంతాలకు వెళ్లి వస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి భాగ్యనగరానికి వచ్చే విహార ప్రేమికుల సంఖ్య కూడా ఎక్కువే. కేవలం ఒక్క వీకెండ్ టూర్పై సాఫ్ట్వేర్ ఉద్యోగులు సుమారు రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు చేస్తారు. అలాంటి టూర్లు నెలకు కనీసం మూడైన ఉంటాయని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ లెక్కన గ్రేటర్లో 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. అందులో 85 శాతం మంది టూర్ ట్రెండ్ను ఆస్వాదించేవాళ్లే. గ్రేటర్ నుంచి కుటుంబ విహారయాత్రలు కూడా అధికంగానే ఉంటాయి. ఫలితంగా రాష్ర్టాలకు నెలకు పర్యాటక శాఖ నుంచి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని టూరిజం అధికారులు చెబుతున్నారు.