కఠిన ఆంక్షల దిశగా పలు దేశాలు
ఫ్రాన్స్లో మూడు వారాల లాక్డౌన్
పారిస్, ఏప్రిల్ 1: యూరప్ను కరోనా థర్డ్ వేవ్ వణికిస్తున్నది. దీంతో మహమ్మారి కట్టడికి ఐరోపా దేశాలు మరోసారి కఠిన ఆంక్షలకు ఉపక్రమిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ కరోనా హాట్స్పాట్గా మారింది. దీంతో దేశంలో 3 వారాల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రన్ గురువారం ప్రకటించారు. దేశీయ రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. దేశవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్లో గత అక్టోబర్ నుంచే రెస్టారెంట్లు, థియేటర్లు, జిమ్లు మూతపడ్డాయి. మరోవైపు జర్మనీ కూడా ఆంక్షలను పొడిగించింది. బెర్లిన్లో ప్రజలు గుమిగూడడంపై పరిమితులు విధించారు. ఫిన్లాండ్ కూడా ప్రధాన నగరాల్లో లాక్డౌన్ విధించేందుకు యోచిస్తున్నది. హంగరీ, ఎస్టోనియాలలోనూ కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. బెల్జియంలో వారాంతాల్లో నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నారు.