హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్జీఏ) కోర్సులో జరగనుంది. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) క్యాలెండర్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం 132 మంది గోల్ఫర్లు బరిలోకి దిగుతారు.
మొత్తం కోటి రూపాయల ప్రైజ్మనీ లభించే ఈ టోర్నీ విజేతకు అందించే ట్రోఫీని మాజీ క్రికెటర్, పీజీటీఐ అధ్యక్షుడు కపిల్ దేవ్తో కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ఆవిష్కరించారు.