ముంబై: గడువు ముగిసిన స్నాక్ మిక్స్ తిన్న రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ)కు ఫిర్యాదు చేయడంతో ఆ అధికారి అక్కడకు చేరుకున్నారు. జనం ఆయనను చుట్టుముట్టారు. గడువు ముగిసిన బిస్కెట్లను తినాలని బలవంతం చేశారు. (Food Body Officer Cornered) ఆ అధికారి లంచం తీసుకుని షాపు వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరగింది. ఒక షాపులో స్నాక్ మిక్స్ కొనుగోలు చేసి తిన్న తర్వాత రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కాగా, ఆ షాపులో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఛత్రపతి సంభాజీనగర్లోని ఎఫ్డీఏ కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ షాపును తనిఖీ చేసేందుకు ఒక ఎఫ్డీఏ అధికారి అక్కడకు చేరుకున్నారు. ఆ దకాణంలో గడువు ముగిసిన బిస్కెట్ ప్యాకెట్లను అమ్ముతున్నట్లు తనిఖీలో ఆయన గుర్తించారు. గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
అయితే తనిఖీ ప్రారంభానికి ముందే చిన్నారి అస్వస్థతకు కారణమైన గడువు ముగిసిన స్నాక్ మిక్స్ ప్యాకెట్లను ఆ షాపు నుంచి తొలగించినట్లు స్థానికులు ఆరోపించారు. అలాగే గడువు ముగిసిన బిస్కెట్ల ప్యాకెట్లను గుర్తించినప్పటికీ ఆ దుకాణదారుడిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంపై వారు ఆగ్రహించారు. ఆ అధికారి లంచం తీసుకుని ఈ విషయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఎఫ్డీఏ అధికారిని జనం చుట్టుముట్టారు. గడువు ముసిగిన ఆ బిస్కెట్లు సురక్షితమైతే ఆయన తినాలని సవాల్ చేశారు. గడువు ముగిసిన బిస్కెట్లను ఆ అధికారి నోటిలో బలవంతంగా పెట్టేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A Food and Drug Administration (FDA) officer was reportedly confronted by an angry crowd during an inspection of a paan shop in Maharashtra’s Chhatrapati Sambhajinagar after locals alleged that the shop was selling expired food products.
A video of the confrontation circulating… pic.twitter.com/5B3RtCD5Bp
— Hate Detector 🔍 (@HateDetectors) August 29, 2026