విదార్థ్, ధృవిక జంటగా నటించిన చిత్రం ‘భగత్సింగ్నగర్’. వాలాజా క్రాంతి దర్శకుడు. వాలాజా గౌరి, రమేష్ ఉడుత్తు నిర్మాతలు. ఈ నెల 26న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కళ్లముందు జరుగుతున్న అన్యాయాలను ఎదురించి ఓ సామాన్యుడు ఎలాంటి పోరాటం చేశాడన్నది ఆకట్టుకుంటుంది. లవ్, ఎమోషన్, రొమాన్స్ సమ్మిళితంగా ఉంటుంది’ అని తెలిపారు. ఎన్నో కష్టాలను దాటుకొని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నిర్మాతలు అన్నారు. నటనకు ఆస్కారమున్న మంచి పాత్రను పోషించానని ధృవిక చెప్పింది.