శేరిలింగంపల్లి, జనవరి 25 : కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) వలంటీర్ల సేవలు అభినందనీయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. మంగళవారం ఎస్సీఎస్సీ అధ్వర్యంలో ఏర్పాటైన వర్చువల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్సీ ప్రతినిధి కృష్ణ ఎదులతో పాటు దాదాపు 160మంది వలంటీర్లు పాల్గొన్నారు.