మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 12 : రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాలమల్లేశ్ విమర్శించారు. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని శుక్రవారం కలెక్టర్ హరీశ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలమల్లేశ్ మాట్లాడుతూ కేంద్రం రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణమూర్తి, నాయకులు కృష్ణ యాదవ్, లక్ష్మి పాల్గొన్నారు.