Eco hill park | హైదరాబాద్లోని కొత్వాల్గూడలో ఎకో హిల్ పార్కు నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ సమీపంలోని హిమాయత్సాగర్ జలాశయాన్ని ఆనుకొని ఉన్న కొత్వాల్గూడ రెవెన్యూ పరిధిలోని 85 ఎకరాల ప్రభుత్వ స్థలంలో హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా ఎకో హిల్ పార్కు పనులను చేపట్టాలని నిర్ణయించిన విషయం విదితమే. ఇందులో భాగంగా నగరవాసులకు వినోదం, విజ్ఞానం అందించే వివిధ రకాల థీమ్లతో పాటు దేశంలోనే అతిపెద్ద అక్వేరియాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థల నుంచి బిడ్లు పిలిచామని హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ తెలిపారు.
ఏడాది పొడవునా నిండుగా ఉండే హిమాయత్సాగర్ జలాశయాన్ని వీక్షించేందుకు వచ్చే పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ ఎకో హిల్ పార్కు ఆటవిడుపుగా మారుతుందని.. ఇందుకనుగుణంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు నిర్మాణాలను డిజైన్, బిల్డ్ ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) విధానంలో చేపడతున్నామని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని, ప్రైవేటు భాగస్వామ్యంతోనే దీన్ని చేపడుతున్నామని అర్వింద్కుమార్ పేర్కొన్నారు. ఆక్వా మెరైన్ పార్క్తో పాటు ఇతర నిర్మాణాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపడుతామని వివరించారు.