పుణె: అల్టిమేట్ ఖోఖో లీగ్లో తెలుగు యోధాస్ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన రెండో క్వాలిఫయర్లో యోథాస్ 67-44తో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో ఒడిశా జగ్గర్నాట్స్తో తెలుగు యోధాస్ తలపడనుంది. గుజరాత్తో పోరులో తెలుగు యోధాస్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కెప్టెన్ ప్రతీక్ ఎప్పట్లాగే బెస్ట్ డిఫెన్స్ స్కిల్స్ కనబర్చాడు. మూడో స్థానంలో నిలిచిన గుజరాత్ జెయింట్స్ రూ.30 లక్షల నగదు బహుమతి అందుకోనుండగా.. ఆదివారం జరిగే ఫైనల్లో విజేత జట్టు ట్రోఫీతో పాటు కోటి రూపాయల దక్కించుకోనుంది. రన్నరప్కు యాభై లక్షల బహుమతి దక్కుతుంది.
జాతీయ చాంపియన్షిప్లో పాల్గొనే క్రీడాకారుల కోసం రాష్ట్ర టీటీ సంఘం
క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందులో శ్రీజతో పాటు నిఖత్ బాను, వరుణి, మౌనిక, ప్రణీత పాల్గొంటున్నారు.