హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ టెక్వేవ్..ఇంజనీరింగ్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం కొత్తగా ఇంటెలిజెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో రాజ్ గుమ్మడపు మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ సేవలను అందించేందుకు అత్యాధునిక క్లౌడ్ ఆధారిత ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ను రూపొందించామన్నారు.
దీంతో వినియోగదారులు తమ ప్రాజెక్టు పనులను రియల్ టైంలో నిర్వహించేందుకు వీలు పడనున్నదన్నారు. ఉత్పాదకతను పెంచడానికి, మంచి ఫలితాలను సాధించడానికి కొత్తగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ దోహదం చేస్తుంది. ఈ అప్లికేషన్లో సహజమైన ఇంటర్ఫేస్, బలమైన ఫీచర్లు ఉండడంతో ఇంజనీరింగ్ ప్రాజెక్టుల నిర్వహణ ఎంతో సులభతరంకానున్నదని తెలిపారు.