లండన్: రోజర్ ఫెదరర్ టెన్నిస్ కేరీర్ ముగిసింది. లావెర్ కప్లో డబుల్స్ మ్యాచ్లో ఫెదరర్, నాదల్ జోడి ఓటమిపాలైంది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఫెదరర్ కొన్ని రోజుల క్రితం టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫెదరర్-నాదల్ జోడి 4-6, 7-6 (7/2), 11-9 స్కోర్తో ఫ్రాన్సెస్ టియాఫో, జాక్ సాక్ చేతిలో ఓటమి పాలయ్యారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రోజర్ కంటితడి పెట్టారు. ఈ జర్నీ అద్భుతంగా సాగిందని, నేను సంతోషంగా ఉన్నానని, బాధపడడం లేదని ఫెదరర్ అన్నారు. రఫేల్తో కలిసి ఆడడం, ఇతర మేటి ఆటగాళ్లు కూడా ఇక్కడే ఉండడం ఆనందంగా ఉందన్నాడు. ఈ మ్యాచ్లో నాదల్, ఫెదరర్ ఓ జోడిగా ఆడినా.. ఆ జంట కొన్నేళ్ల పాటు ప్రధాన ప్రత్యర్థులుగా పోటీపడ్డారు. రెండు దశాబ్ధాల పాటు ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఇద్దరు కలిసి 42 గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచారు. 2004లో తొలిసారి పోటీపడ్డ ఆ ఇద్దరు .. వారి మధ్య 40 సార్లు గ్రాండ్స్లామ్ మ్యాచ్లు జరిగాయి. 9 గ్రాండ్స్లామ్ ఫైనల్స్లో ఆడారు. అయితే నాదల్ 24-16 తేడాతో ఫెదరర్పై విన్నింగ్ రికార్డ్ కలిగి ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత భార్య, పిల్లలను ఫెదరర్ హత్తుకుని ఏడ్చేశాడు. ఓ దశలో నాదల్ కూడా కన్నీళ్లు తుడుచుకున్నాడు.