హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ గడువును పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.
ఈ నెల 31లోపు పూర్తిచేయాలనడం సబబుకాదని, వేసవి సెలవులు, జనగణన విధుల్లో టీచర్లు ఉండటంతో ఈ గడువును పొడిగించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కపల్లి పెంటయ్య, తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ వేర్వురు ప్రకటనల్లో కోరారు.