జూబ్లీహిల్స్,ఆగస్టు26: నకిలీ వైద్యులపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రహ్మత్నగర్, వెంకటగిరి, బోరబండ ప్రాంతాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రహ్మత్నగర్ శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్పై దాడిచేసి తన భార్య నాగజ్యోతి (డీ ఫార్మసీ) పేరుమీద ఆక్వా ఫార్మసీ నడుపుతున్న రామశేఖర్ రెడ్డితో పాటు డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ పూర్తిచేసి అక్కడే అనధికారికంగా వైద్యం అందిస్తున్న రాగం సుధాకర్ వద్ద ఇంజెక్షన్లు, బటర్ఫ్లై నీడిల్స్, గడువు ముగిసిన టామడాల్ ఇంజెక్షన్లు, 30 పెద్ద స్లైన్ బాటిల్స్, రూ.10 వేల విలువైన సర్జికల్ కత్తెరలు స్వాధీనం చేసుకున్నారు.
రహ్మత్నగర్లో ఎటువంటి అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతూ రోగుల నుంచి రూ.50 నుంచి రూ.100 వరకు ఫీజు వసూలు చేస్తున్న మిరుదొడ్డి భారతిని కూడా అదుపులోకి తీసుకుని పారాసిటమాల్ పీడీయాట్రిక్ సిరప్లు, యాంటీ బయోటిక్స్, ప్రెగ్నెన్సీ కిట్లు, బీపీ మిషన్, స్టెతస్కోప్, స్లైన్ ఇంఫ్యూజన్ సెట్లు, రూ.20 వేల విలువైన డిస్పో వ్యాన్ సిరంజిలు స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరిలో పేరులేకుండా క్లినిక్ నడుపుతున్న కాటిక మహేశ్ రావును, బోరబండ గంగానగర్లో క్లినిక్ ఏర్పాటు చేసిన మహమ్మద్ అబ్దుల్ అలీ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.