హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో అంతర్జాతీయ టైక్వాండో ప్లేయర్ సింధు తపస్వి మొక్కలు నాటింది. ఆదివారం తన జన్మదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరేట్ ఆవరణలో మొక్కలు నాటింది. పుట్టిన రోజు గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడడం సంతోషంగా ఉందని పేర్కొంది. మొక్కలను రక్షిస్తే.. అవి మనల్ని రక్షిస్తాయని చెప్పింది. ఇప్పుడు ఉన్న సమాయంలో మొక్కలు నాటాల్సిన బాధ్యత యువతపై ఎక్కువగా ఉందని తెలిపింది. గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్కుమార్కు సింధు ధన్యవాదాలు తెలిపింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్ పాల్గొన్నారు.