తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో రైతు వేదిక భవనాలు ప్రారంభంమోత్కూరు, జూన్ 9: రైతు సంక్షేమమే ధ్యే యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని అనాజిపు రం, పాటిమట్ల గ్రామాల్లో ప్రభుత్వం నిర్మించిన రైతు వేదిక భవనాలను ఆయన ప్రారంభించి మా ట్లాడారు. ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు, రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు మూడు, నాలుగు గ్రామాలకో క్లస్టర్ గ్రామా న్ని ఎంపిక చేసి రైతు వేదిక భవనాలను నిర్మించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లో 28 రైతు వేదిక భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జూలై నెలాఖరుకు అన్ని వేదికల నిర్మాణాలు పూర్తి చేసుకొని రైతులకు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపా రు. అనాజిపురంలో డ్రైనేజీ నిర్మాణానికి రూ. 10 లక్షలను మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మోత్కూరు జడ్పీటీసీ గొరుపల్లి శారదాసంతోష్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, ఎంపీపీ సంధ్యారాణి, మండల వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, రైతు సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ అమరేందర్, మోత్కూరు,అడ్డగూడూరు మండలాల కో-ఆర్డినేటర్లు సోంమల్లు, తీపిరెడ్డి మేఘారెడ్డి, సర్పంచ్లు ఉప్పల లక్ష్మమ్మ, దండేబోయిన మల్లేశ్యాదవ్, మధు, కవితాశ్రీనివాస్, రజితారాజిరెడ్డి, ఎంపీటీసీ కల్పన, డీఏవో అనురాధ, ఏడీఏ వెంకటేశం, తహసీల్దార్ షేక్ అహ్మద్, ఎంపీడీవో మనోహర్రెడ్డి, ఏవో స్వప్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ యా కుబ్రెడ్డి, జంగ శ్రీను, వెంకటేశ్వర్లు, పద్మారెడ్డి, కల్యాణ్ చక్రవర్తి, వెంకన్న పాల్గొన్నారు.రైతుల సంక్షేమం కోసమే..అడ్డగూడూరు, జూన్ 9: రైతుల సంక్షేమం కోసమే రైతు వేదిక భవనాలను ప్రారంభిస్తున్నట్లు తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని గట్టుసింగారం, చౌళ్లరామారం గ్రామాల్లో రూ.22 లక్షలతో నిర్మించిన రైతువేదిక భవనాలను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్గా విభజించి రైతు వేదిక భవనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల బాగు కోసం ఈ వేదికలు దోహదపడతాయన్నారు.ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభంమండలంలోని చౌళ్లరామారం గ్రామంలో డీఎంఎఫ్ నిధులు రూ.10.50 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే కిశోర్కుమార్ ప్రారంభించారు. పేదల వైద్యం కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. అదేవిధంగా చిర్రగూడూరు గ్రామంలో రూ. 12.60 లక్షలతో వైకుంఠధామాన్ని రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డును, రూ.5లక్షలతో సీసీరోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ కోల్పుల అమరేంద ర్, ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య, సింగిల్ విండో చైర్మన్ పోన్నాల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ దైద పురుషోత్తంరెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ తీపిరెడ్డి మేఘారెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు గుండిగ జోసఫ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కొప్పుల సోమిరెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, సర్పంచ్లు కమ్మంపాటి పరమేశ్, మద్ది సత్తయ్య, ఎంపీటీసీ చిగుళ్ల ఉపేంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో చంద్రమౌళి, ఏవో అరుణకుమారి, మండల ప్రత్యేకాధికారి పాల్గొన్నారు.