బండ్లగూడ: ప్రభుత్వ ఆదేశాలతో దోమలను తరిమి కొట్టేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.దోమల నివారణకు పుట్టకుండా,కుట్టకుండా అనే కార్యక్రమం ద్వారా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య కార్మికులు పలు బస్తీలలో పర్యటించి మురికినీరు నిల్చిన ప్రాంతాలల్లో అల్బోడ్ఆయిల్,అయిల్ బాల్లను వదులుతున్నారు.దోమల లార్వాను తుది దశలోనే అంతమొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేషన్ మేనేజర్ మనోహర్ తెలిపారు.
సోమవారం పద్మశ్రీహిల్స్,నర్సారెడ్డికాలనీ,పి అండ్ టీ కాలనీ,బండ్లగూడ తదితర ప్రాంతాలలో పర్యటించి దోమల నివారణ కు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఖాళీస్థలాలలో పెరిగిన పిచ్చి గడ్డిపై కూడ రసాయనాలను చల్లినుట్లు వారు తెలిపా రు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు సురేష్గౌడ్ మానసఎన్క్లెవ్లో మురికి ప్రాంతాలను గుర్తించి రసాయనాలు చల్లించారు.