అహ్మదాబాద్: బిల్కిస్ బానోపై లైంగికదాడికి పాల్పడిన దోషులను విడుదల చేయడంపై గుజరాత్లోని సామాజిక కార్యకర్తలు తీవ్ర నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. దాహోడ్ జిల్లా రంధిక్పూర్ నుంచి అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం వరకు 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.
బిల్కిస్ బానో కేసులో దోషులైన 11 మందిని గుజరాత్ సర్కారు రెమిషన్ ఇచ్చి ఆగస్టు 15న విడుదల చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. కాగా, హిందూ ముస్లిం ఏక్తా సమితి ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలు సెప్టెంబర్ 26నుంచి అక్టోబర్ 4 వరకు భారీ పాదయాత్రకు సంకల్పించారు. ఈ పాదయాత్రలో 25 మంది సామాజిక కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని, సామాజిక కార్యకర్త సందీప్ పాండే పాల్గొననున్నారు. దోషుల విడుదల దేశానికే సిగ్గుచేటన్నారు.