ఖేల్ రత్న అందుకున్న మిథాలీ, నీరజ్, లవ్లీనా శిఖర్ ధవన్కు అర్జున
న్యూఢిల్లీ: వార్షిక క్రీడా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ క్రీడా తారలతో తళుక్కుమంది. శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా..మేజర్ ధ్యాన్చంద్ ఖేల్త్న్ర పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు. అథ్లెటిక్స్లో కొత్త చరిత్ర నాంది పలికిన నీరజ్ అవార్డు తీసుకుంటున్న సమయంలో అతిథుల కరతాళ చప్పట్లతో దర్బార్ హాల్ మారుమోగింది. అటు తర్వాత మహిళల క్రికెట్లో ఎన్నో రికార్డులు తిరుగరాసిన హైదరాబాదీ క్రికెటర్ మిథాలీరాజ్ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని స్వీకరించింది. ఈ ఘనత అందుకున్న తొలి మహిళా క్రికెటర్గా మిథాలీ నిలిచింది. నీరజ్, మిథాలీతో పాటు రవికుమార్ దహియా (రెజ్లింగ్), లవ్లీనా బొర్గోహై (బాక్సింగ్), పీఆర్ శ్రీజేష్, మన్ప్రీత్సింగ్ (హాకీ), అవనీ లెఖరా, సుమిత్ అంటిల్, ప్రమోద్ భగత్, క్రిష్ణ నాగర్, మనీశ్ నార్వల్, సునీల్ ఛెత్రీ..ఖేల్త్న్ర అవార్డులు పొందారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం కింద విజేతలకు రూ.25 లక్షల ప్రోత్సాహం లభించనుంది. క్రికెటర్ శిఖర్ ధవన్ సహా 35 మంది అర్జున అవార్డు అందుకున్నారు. ప్రతి ఏడాది హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న క్రీడా అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ఈసారి టోక్యో ఒలింపిక్స్తో పాటు పారాలింపిక్స్ ముగిసిన తర్వాత దీన్ని నిర్వహించారు.