ప్రకటించుకొన్న శశికళ
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ ఆదివారం చెన్నైలోని ఎంజీఆర్ స్మారకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అన్నాడీఎంకే పార్టీ జెండాను ఎగురవేశారు. అక్కడ ఆవిష్కరించిన శిలాఫలకంపై తనను తాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకొన్నారు. ‘పార్టీ కోసం, ప్రజల సంక్షేమం కోసం అందరూ ఒక్కటవ్వాల్సిన సమయం వచ్చింద’న్నారు. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత డీ జయకుమార్ స్పందిస్తూ పార్టీ జెండాను ఎగురవేసే హక్కు శశికళకు లేదన్నారు.