మూడు వేవ్ల కరోనా వల్ల దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్లు వాయిదాలు పడి ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తున్నాయి. వాటిలో షాహిద్కపూర్ ‘జెర్సీ’ సినిమా కూడా ఒకటి. గతంలో ఈ సినిమాకు పబ్లిసిటీ కార్యక్రమాలు చేసుకోగా..థర్డ్ వేవ్ వచ్చి రిలీజ్ వాయిదా పడింది. దీంతో మరో తేదీ చూసుకుని ఇప్పుడు ఫ్రెష్గా ప్రచార కార్యక్రమాలు మొదలుపెడుతున్నారు. ఇందుకు అసహనానికి గురైన షాహిద్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులనే సలహాలు అడిగారు. ‘ఒక సినిమాకు రెండు సార్లు ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో చెబుతారా’ అని పోస్టు చేశారు. వచ్చే నెల 14న విడుదల కాబోతున్నదీ సినిమా. నాని హీరోగా నటించిన తెలుగు సినిమా ‘జెర్సీ’ని అదే పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. మాతృక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్కీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రతిభ గల క్రికెటర్ ఫెయిల్యూర్ కథను ఉద్వేగపూరితంగా చూపించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల మెప్పుతో పాటు జాతీయ పురసారం దకింది. అందుకే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.