దర్శకురాలిగా కొనసాగే ప్రయత్నాలు చేస్తున్నది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. ‘మణికర్ణిక, ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రాన్ని దర్శకుడు క్రిష్తో కలిసి రూపొందించిన కంగనా. ఆ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నాక…మిగతా సినిమా తానే తెరకెక్కించింది. అప్పటికి ఆపద్ధర్మంగా దర్శకురాలు అయ్యిందని అంతా అనుకున్నారు గానీ మెగాఫోన్ పట్టడాన్ని కొనసాగిస్తుందని అనుకోలేదు. కానీ తాను ఓ కొత్త చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించబోతున్నట్లు కంగనా తెలిపింది. ఆమె మాట్లాడుతూ…‘నేను ఓ కొత్త సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించబోతున్నా. ఈ చిత్రంలో నటిస్తాను కూడా’ అని తెలిపింది. గతేడాది నిర్మాతగా మారి తన మణికర్ణిక ఫిలింస్ పతాకంపై ‘టికు వెడ్స్ షేరు’ అనే చిత్రాన్ని నిర్మించింది కంగనా రనౌత్. డార్క్ కామెడీ డ్రామాగా నిర్మితమైన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధికీ, అన్విత్ కౌర్ జంటగా నటించారు. ఓటీటీలో రిలీజ్ కానుందీ సినిమా. ‘ఎమర్జెన్సీ’, ‘మణికర్ణిక రిటర్న్స్, ద లెజెండ్ ఆఫ్ దిడ్డ’ అనే మరో రెండు చిత్రాలు ఆమె ప్రొడక్షన్లో ఉన్నాయి. ఇలా నిర్మాణం, దర్శకత్వంలో తీరిక లేని కంగనా.నటిగా ‘తేజస్’, ‘దాకద్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
Kangana Ranaut | పర్పూల్ కలర్ డ్రెస్లో కంగనా రనౌత్ గ్లామర్ షో..