కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సెబాస్టియన్ పీసీ 524’. కోమలీ ప్రసాద్, సువేక్ష నాయికలుగా నటిస్తున్నారు. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి. జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడు. మార్చి 4న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి యూ.ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…కిరణ్ అబ్బవరం గత రెండు చిత్రాల్లాగే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. అందుకే సెన్సార్ నుంచి యూ.ఏ ధృవీకరణ ఇచ్చారు’అని అన్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణి రఘువరన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : జిబ్రాన్, సినిమాటోగ్రఫీ : రాజ్ కె నల్లి.