బాలీ: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్కు భారత జోడీ సాత్విక్సాయిరాజ్-చిరాగ్ శెట్టి అర్హత సాధించింది. ఈ జోడీ ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. బుధవారం నుంచి మొదలవుతున్న ఈ టోర్నీలో భారత్ నుంచి పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, యువ షట్లర్ లక్ష్యసేన్, సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప పోటీకి దిగుతున్నారు.