ఈ నెల 31 వరకు ‘పోషణ్ పక్వాడ’
అంగన్వాడీల్లో ప్రత్యేక యాప్లో చిన్నారుల బరువు వివరాలు నమోదు
మెదక్ రూరల్, మార్చి 26: మాతా, శిశు సంరక్షణ కోసం రాష్టప్రభుత్వం ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నది. పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భణులు, బాలింతలు సం తులిత ఆహారం తీసుకునేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేసున్నది. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే గర్భణులు, బాలింతలు, చిన్నారులు పోషణ లోపంతో బాధ పడకూడదన్న ఉద్దేశం తో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, పాలు, బాలామృతం, మధ్యాహ్న భోజనం, చిరుతిళ్లు అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు పాఠశాలలు, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్పక్వాడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈనెల 31వరకు చేపట్టే కార్యక్రమాలు
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు పరిశీలించి వయసుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించి వారికి సరైన ఆహారం అందించడం.
కిశోర బాలికలకు ఆరోగ్య సంబంధ అంశాలపై అవగాహన, గర్భణులు, బాలింతలు, పోషకాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను తెలియచేస్తారు.
ప్రత్యేక యాప్లో వివరాల నమోదు
పిల్లల బరువు, ఎత్తును కొలుస్తారు. ఏ వయసులో ఎంత బరువు, ఎత్తు ఉండాలనే వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన గ్రోత్ మానిటరింగ్ సర్వే యాప్ ద్వారా అంగన్వాడీ టీచర్లు వారి ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పిల్లల వివరాలను నమోదు చేస్తున్నారు.