Robinhood | నితిన్ రాబిన్హుడ్ సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు ఈరోజు ఉదయం నుంచి వార్తలు అటు మీడియాతో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని థియేటర్లలో టికెట్ ధరలను పెంచినట్లు మీడియాలో వస్తున్న వార్తలు అబద్దమంటూ ప్రకటించింది.
రాబిన్హుడ్ సినిమాకు టికెట్ ధరలను పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అబద్దం. ఈ అనవసరమైన పుకార్లను ఖండించడంతో పాటు.. సినిమాను సరసమైన ధరలకు అందరికీ అందుబాటులో ఉంచి, సంపూర్ణ వినోదాన్ని అందించడమే తమ ఉద్దేశమని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కేవలం కొన్ని ఎంపిక చేసిన ప్రీమియం థియేటర్లలో మాత్రమే ధరల పెంపు ఉంటుందని, మిగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలతో పాటు తెలంగాణ అంతటా అన్ని కేంద్రాల్లో సాధారణ ధరలే అమలులో ఉంటాయని చిత్ర బృందం వెల్లడించింది. ఇక పెరిగిన ధరలను బట్టి చూసుకుంటే.. ఎంపిక చేసిన ప్రీమియం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ. 50 అదనంగా పెరుగుతుండగా.. మల్టీప్లెక్స్లలో రూ. 75 అదనంగా పెరుగనుంది. అయితే ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Explosive entertainment at affordable prices.#Robinhood pic.twitter.com/v8W5PZKXGa
— Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2025