ఆర్మూర్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాకీ దిగ్గజ క్రీడాకారుడు ధ్యాన్చంద్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఆర్మూర్ లయన్స్క్లబ్ ఆఫ్ నవనాథపురం, లియోక్లబ్ నవనాథపురం ఆధ్వర్యంలో ఆయన జయంతిని ఆదివారం నిర్వహించారు. అనంతరం క్రీడా దినోత్సవం సందర్భంగా లయన్స్క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో 2 కే రన్ను సీఐలు సైదేశ్వర్, విజయ్కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా లయన్స్క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ధ్యాన్చంద్ గొప్ప హాకీ క్రీడాకారుడని గుర్తుచేసుకున్నారు. మూడు సార్లు స్వర్ణ పతకాన్ని సాధించి దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చారన్నారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు ప్రపంచస్థాయి క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబర్చాలని సూచించారు. అనంతరం జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులను లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు.
కార్యక్రమంలో లయన్స్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు పుప్పాల శివరాజ్కుమార్, బిజ్జు సంతోష్, కోశాధికారి జ్ఞాని చావ్లా, ప్రోగ్రాం కోఆర్డినేటర్ మ్యాక మోహన్దాస్, ప్రతినిధులు రూపాలి నర్సయ్య, సత్యనారాయణ, చెన్న రవికుమార్, హరినారాయణ, ఆర్మూర్ యూత్ క్లబ్ అధ్యక్షుడు గట్టడి నితిన్కుమార్, సామాజిక కార్యకర్త విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.