షాద్నగర్ : చేవేళ్ల ఎంపీ రంజిత్రెడ్డి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఎంపీ రంజిత్రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ దివ్యాంగులకు ట్రై మోటరు వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిప్ట్ ఏ స్మైల్లో భాగంగా 105 మందికి వాహనాలను అందించడం సంతోషకరమన్నారు. ఎంపీ రంజిత్రెడ్డి గొప్ప మానవతావాదని ప్రశంసించారు. రంజిత్రెడ్డి చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారన్నారు. ఇదే కాకుండా చేవెళ్ల పరిధిలోని సర్కారు దవాఖానలకు 7 అంబులెన్స్ వాహనాలతో పాటు చేవేళ్ల పరిధిలోని అన్ని గ్రామాల్లో సర్కారు విద్యార్థుల కోసం డిజిటల్ టీవీలను సైతం అందించారని గుర్తు చేశారు. చేవేళ్ల ఎంపీగా రంజిత్రెడ్డి ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు.
దివ్యాంగులకు మోటర్ సైకిళ్లు పంపిణీ
చేవెళ్ల మండల పరిధిలోని ఈర్లపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు వార్ల శంకర్గౌడ్, దేవరంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు గడ్డమీది శ్రీనివాస్కు మోటర్ సైకిళ్లు అందజేశారు. ఈర్లపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడికి టీఆర్ఎస్ నియోజకవర్గయూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్డి, దేవరంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడికి సర్పంచ్ నరహరిరెడ్డి చొరవతో మోటర్ సైకిళ్లు పంపిణీ చేయడంతో వారిని ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.